మూడేళ్ల తర్వాత హిట్.. ఆనందంగా ఉంది

మూడేళ్ల తర్వాత హిట్.. ఆనందంగా ఉంది

ఎన్నో ఫ్లాపుల తర్వాత  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టిన పూరి జగన్నాథ్..  ఆ చిత్ర  విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ తో కలసి విజయవాడలో సందడి చేశారు. విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ కి విచ్చేసిన డైరెక్టర్ పూరి.. మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల తరువాత సూపర్ హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. హిట్స్ కి సీజన్ , అన్ సీజన్ ఉండదని, సినిమా నచ్చితే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని, ఇస్మార్ట్ శంకర్  ఆ విషయాన్ని నిరూపించిందని అన్నారు.

ఈ  సినిమాపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. తాను హీరో ఆకాష్ ని ఎప్పుడూ కలవలేదని, ఆయనకి తన కథతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఒక చిత్రం విజయవంతం అయ్యాక ఇలాంటి అలిగేషన్స్ అనేవి వస్తుంటాయని అన్నారు.  ఈ సినిమాకు మూలం ఓ హాలీవుడ్ చిత్రం అని తెలిపారు. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పానని అన్నారు.

ప్రస్తుతం తాను మహేష్ బాబు విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నానని.. కానీ మహేష్ తో సినిమా గురించి ఇప్పుడప్పుడే అడగద్దని మీడియాకు తెలిపారు పూరీ జగన్నాథ్.