నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనయ్ : డీకే అరుణ

నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనయ్ : డీకే అరుణ

మద్నూర్, వెలుగు :  తెలంగాణ ఉద్యమ ట్యాగ్​లైన్​అయిన నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్​ప్రభుత్వం పూర్తి చేయలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. జుక్కల్​బీజేపీ అభ్యర్థి అరుణతార సోమవారం నామినేషన్​వేస్తున్న సందర్భంగా  సోమవారం డీకే అరుణ మద్నూర్​కు వచ్చారు. నామినేషన్ ముగిసిన అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. మేడిగడ్డ, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లోనూ భారీ అవినీతి జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే సాధ్యం కాలేదన్నారు. ఆంధ్రా పెత్తందారులతో కొట్లాడిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నియంత కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధం కావాలన్నారు.​ బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్​సర్కార్​తో పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. జుక్కల్​ఎమ్మెల్యే అభ్యర్థి అరుణతార, అసెంబ్లీ కన్వీనర్​శ్రీధర్​కులకర్ణి, బిచ్కుంద మండలాధ్యక్షులు కిష్టారెడ్డి, జగ్​మోహన్​తదితరులు పాల్గొన్నారు.