మంచి ఫుడ్ పెడుతున్నారా? : డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర

మంచి ఫుడ్  పెడుతున్నారా? : డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మంచి ఫుడ్​ పెడుతున్నారా? సౌలతులు సక్రమంగా ఉన్నాయా? అని డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర ఆరా తీశారు. నగరంలో రెడ్ క్రాస్  ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. 

హోమ్​లో ఉంటున్న పిల్లలతో, నిర్వాహకులతో మాట్లాడారు. చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. జిల్లా అధికారులతో మాట్లాడి అవసరమైన సౌలతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.