ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ ఫొటో తీస్తున్నారా?

ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ ఫొటో తీస్తున్నారా?

రెస్టారెంట్‌‌కి వెళ్లినా, ఇంట్లో ఏదైనా స్పెషల్‌‌ చేసుకున్నా.. వెంటనే ఫొటో తీసి సోషల్‌‌మీడియాలో పోస్ట్‌‌ చేస్తారు చాలామంది. ఫొటో తియ్యంది, సోషల్‌‌ మీడియాలో పెట్టంది కనీసం ముట్టుకోరు కూడా. అయితే, అట్ల చేయడం వల్ల లావు పెరుగుతరట. ‘ఫొటో తీస్తే లావు ఎట్ల పెరుగుతరు?’ అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే.

ఏదైనా తినేముందు వందలో 70 మంది కచ్చితంగా ఫొటో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేస్తున్నట్లు సర్వేల్లో తేలింది. అయితే, అలా చేయడం వల్ల క్రేవింగ్స్‌‌ పెరుగుతాయట. మామూలు దానికంటే ఎక్కువగా తింటారట. యూఎస్‌‌లోని జార్జియా సదరన్‌‌ యూనివర్సిటీ చేసిన సర్వే ఈ విషయాలు చెబుతోంది. తినేముందు ఫొటో తీసే వాళ్లలో క్రేవింగ్స్‌‌ ఎక్కువగా ఉండి.. ఇంకా ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుందని ఆ రీసెర్చ్‌‌లో తేలింది. అంతేకాకుండా రెండోసారి తినాలనిపిస్తుందట. ఫొటో తీసుకోవడం వల్ల ఆ ఐటమ్‌‌పై తెలియకుండానే ఇష్టం పెరిగిపోయి.. మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుందనేది సారాంశం. 

జార్జియా సదరన్ యూనివర్సిటీ 145 మంది స్టూడెంట్స్‌‌పై ఈ రీసెర్చ్‌‌ చేసింది. స్టూడెంట్స్‌‌ని రెండు గ్రూపులుగా విభజించి ఒక్కోక్కరికి ఒక్కో ప్లేట్‌‌ ఛీజ్‌‌ క్రాకర్స్‌‌ ఇచ్చారు. వాళ్లలో ఒక గ్రూప్‌‌ను వెంటనే తినమని చెప్పి, ఇంకో గ్రూప్‌‌ను ఫొటోలు తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశాక తినమని చెప్పారు. తిన్నతర్వాత ఫుడ్‌‌కి రేటింగ్‌‌ ఇవ్వమని అడిగితే. ఫొటోలు తీసిన వాళ్లు.. ఫుడ్‌‌ను చాలా బాగా ఎంజాయ్‌‌ చేశామని, మళ్లీ కావాలని అడిగారని రీసెర్చ్‌‌ గ్రూప్‌‌ చెప్పింది. అందుకే, ఎవరైనా ఎక్కువగా తినకుండా ఉండాలన్నా.. జంక్‌‌ఫుడ్‌‌ను మానేయాలన్నా ఫొటోలు తీసుకోకపోవడం బెటర్‌‌‌‌ అని చెప్పింది. ఫొటోలు తియడం అంటే స్వీట్​ మెమొరీగా ఉంచుకోవడం కాబట్టి. దాన్ని బ్రెయిన్‌‌ మళ్లీ    మళ్లీ కోరుకుంటుందని చెప్పారు రీసెర్చర్‌‌‌‌లు.