
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్ తర్వాత వచ్చే సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సోనియా గాంధీని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
Congress President Sonia Gandhi is currently being treated for a fungal infection detected in her lower respiratory* tract, along with other post-COVID symptoms. She continues to be under close observation and treatment: Congress party issues a statement pic.twitter.com/YS1C4hw9j4
— ANI (@ANI) June 17, 2022
మరోవైపు సర్ గంగారామ్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సోనియా గాంధీని శుక్రవారం రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మనీలాండరింగ్ కేసులు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేనందున ..తన తల్లిదగ్గర ఉండేందుకు కొద్ది రోజుల పాటు విచారణ వాయిదా వేయాలని గురువారం ఈడీని కోరగా..అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీ..ఈ నెల 23న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.