
పద్మారావునగర్, వెలుగు: పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్యాదవ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాట్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు. 1993లో ఇంజినీర్ ట్రైనీగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ట్రాన్స్మిషన్ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశారు. ఇంతకుముందు పవర్ గ్రిడ్ కార్పొరేట్ కార్యాలయం గుర్గావ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలిందించారు.