2 శాతం పెరిగిన బండ్ల హోల్​సేల్స్​

2 శాతం పెరిగిన బండ్ల హోల్​సేల్స్​


న్యూఢిల్లీ: మనదేశ మార్కెట్లో  ప్యాసింజర్ వెహికల్స్​ హోల్​సేల్స్​ ఈ ఏడాది​జూన్‌‌లో 2 శాతం పెరిగి 3,27,487 యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా మల్టీ యుటిలిటీ వెహికల్స్​కు​ డిమాండ్ బలంగా ఉందని సొసైటీ ఆఫ్​ ఇండియన్​ ఆటోమొబైల్​ మానుఫ్యాక్చరర్స్​ (సియామ్​) బుధవారం తెలిపింది. 2022 జూన్ లో డీలర్లకు కంపెనీలు 3,20,985 యూనిట్లను అమ్మాయి. మొత్తం టూవీలర్ల విక్రయాలు గత నెలలో 2 శాతం పెరిగి 13,30,826 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 13,08,764 యూనిట్లను అమ్మారు. త్రీవీలర్లు 2022 జూన్ లో 26,701 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి జూన్‌‌లో దాదాపు రెండు రెట్లు పెరిగి 53,019 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్​ పేర్కొంది.