
న్యూఢిల్లీ: మనదేశ మార్కెట్లో ప్యాసింజర్ వెహికల్స్ హోల్సేల్స్ ఈ ఏడాదిజూన్లో 2 శాతం పెరిగి 3,27,487 యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా మల్టీ యుటిలిటీ వెహికల్స్కు డిమాండ్ బలంగా ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) బుధవారం తెలిపింది. 2022 జూన్ లో డీలర్లకు కంపెనీలు 3,20,985 యూనిట్లను అమ్మాయి. మొత్తం టూవీలర్ల విక్రయాలు గత నెలలో 2 శాతం పెరిగి 13,30,826 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 13,08,764 యూనిట్లను అమ్మారు. త్రీవీలర్లు 2022 జూన్ లో 26,701 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి జూన్లో దాదాపు రెండు రెట్లు పెరిగి 53,019 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ పేర్కొంది.