అమెరికా అధ్యక్షడు ట్రంప్ అక్టోబరు నాటికి కరోనా వ్యాక్సిన్ రావోచ్చని చెప్పారు. అయితే ఈ విషయంపై ట్రంప్ చెబుతున్న మాటలను తాను నమ్మబోనని డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అన్నారు. వ్యాక్సిన్స్ సమర్థత, పనితీరుపై విశ్వసనీయమైన సమాచారం ఉంటే తప్ప ట్రంప్ మాటలను నమ్మేది లేదన్నారు. నవంబరు 3న జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వ్యాక్సిన్పై ప్రకటనలు చేస్తున్నారని.. తానేదో చేశానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కమలా హ్యారిస్.
అమెరికాలో కరోనా సోకి ఇప్పటి వరకు 1.91 లక్షల మందికి పైగా మరణించారు. 63 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు.