కరీంనగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత

కరీంనగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత

కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కలిసి ఇవాళ ప్రారంభించారు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ దగ్గర పేదలు నిరసనకు దిగారు. 

అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వడం లేదంటూ స్థానిక ప్రజలు ఫైర్ అయ్యారు. లీడర్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. పేదలైన తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.