న్యూఢిల్లీ: ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) పథకాల ద్వారా రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 741 దరఖాస్తులు వచ్చాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ ప్రకటించారు. మొత్తం 14 పీఎల్ఐ పథకాల కోసం ఈ దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటికే రూ.1.03 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
ఈ కంపెనీల అమ్మకాల విలువ ఇప్పటికే సుమారు రూ.8.6 లక్షల కోట్లకు చేరుకుంది. దాదాపు 6.78 లక్షల మందికి ఉపాధి దొరికింది. ఇన్సెంటివ్స్ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.2,900 కోట్లు మాత్రమే ఇచ్చామని ఆయన చెప్పారు. తదనంతరం ఈ ప్లాన్ని ఇతర రంగాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు.