
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ట్రేడ్ జెనరిక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టినట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక డివిజన్ ‘ఆర్జెన్ఎక్స్’ను ఏర్పాటు చేసింది. 2030 నాటికి 150 కోట్ల మందికి సేవలు అందించాలన్న టార్గెట్ను చేరుకోవడానికి ఈ కొత్త వ్యాపారం సాయపడుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలతో సహా నగరాలు, పట్టణాలలో తన ట్రేడ్ జెనరిక్స్ను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. ఉత్పత్తులను మరింత మందికి చేర్చడానికి ఛానెల్ పార్ట్నర్లతో కలిసి పని చేస్తోంది.
నేరుగా వాణిజ్యానికి పంపించే మందులను ట్రేడ్ జెనరిక్స్ అంటారు. వీటి గురించి డాక్టర్ల ద్వారా ప్రచారం చేయించరు. ఇండియా తమకు కీలకమైన మార్కెట్అని, ఇక్కడ బలమైన వ్యాపారాన్ని నిర్మించాలనే తమ ప్రయత్నానికి ట్రేడ్ జెనరిక్స్ ఉపయోగపడతాయని డాక్టర్ రెడ్డీస్ ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీఈఓ ఎంవీ రమణ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 2 శాతం పెరిగి రూ.4,993 వద్ద ముగిసింది.