ట్రేడ్​ జెనరిక్స్​ బిజినెస్​లోకి డాక్టర్​ రెడ్డీస్​

ట్రేడ్​ జెనరిక్స్​ బిజినెస్​లోకి డాక్టర్​ రెడ్డీస్​

హైదరాబాద్​, వెలుగు: నగరానికి చెందిన ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​ ట్రేడ్​ జెనరిక్స్​ బిజినెస్​లోకి అడుగుపెట్టినట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక డివిజన్​ ‘ఆర్​జెన్​ఎక్స్​’ను ఏర్పాటు చేసింది. 2030 నాటికి 150 కోట్ల మందికి సేవలు అందించాలన్న టార్గెట్​ను చేరుకోవడానికి ఈ కొత్త వ్యాపారం సాయపడుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది.  గ్రామీణ ప్రాంతాలతో సహా  నగరాలు, పట్టణాలలో తన ట్రేడ్​ జెనరిక్స్‌‌‌‌‌‌‌‌ను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. ఉత్పత్తులను మరింత మందికి చేర్చడానికి ఛానెల్ పార్ట్​నర్లతో కలిసి పని చేస్తోంది.

నేరుగా వాణిజ్యానికి పంపించే మందులను ట్రేడ్ జెనరిక్స్ అంటారు. వీటి గురించి డాక్టర్ల ద్వారా ప్రచారం చేయించరు. ఇండియా తమకు కీలకమైన మార్కెట్అని, ఇక్కడ బలమైన వ్యాపారాన్ని నిర్మించాలనే తమ ప్రయత్నానికి  ట్రేడ్​ జెనరిక్స్​ ఉపయోగపడతాయని డాక్టర్​ రెడ్డీస్​ ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీఈఓ ఎంవీ రమణ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌లో ఈ కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే  శుక్రవారం 2 శాతం పెరిగి రూ.4,993 వద్ద ముగిసింది.