మహబూబ్ నగర్ లో ఆకట్టుకున్న డ్రోన్​ షో

మహబూబ్ నగర్ లో ఆకట్టుకున్న డ్రోన్​ షో

జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్​బండ్ పై ఆదివారం రాత్రి 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. డ్రోన్​ ప్రదర్శనను తిలకించేందుకు పట్టణ ప్రజలు తరలివచ్చారు. డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ, మహబూబ్ నగర్ మ్యాప్, కోహినూరు వజ్రం, కేసీఆర్  అర్బన్  ఎకో పార్క్, పిల్లలమర్రి, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం,

ఐటీ టవర్, జోగులాంబ టెంపుల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం కేసీఆర్, జై భారత్, జై తెలంగాణ, మన మహబూబ్ నగర్ అనే పదాలు, వివిధ చిత్రాలు అలరించాయి. జడ్పీ చైర్ పర్సన్  స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ జి రవినాయక్, ఎస్పీ కె నరసింహ, టూరిజం ఎండీ మనోహర్, మున్సిపల్  చైర్మన్  కేసీ నర్సింలు, లైబ్రరీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్  పాల్గొన్నారు.

- మహబూబ్ నగర్ టౌన్, వెలుగు