
- డీజీపీ జితేందర్ వెల్లడి
- కొడంగల్లో పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ
కొడంగల్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్కట్టడికి ప్రభుత్వం జీరో టోలరెన్స్విధానాన్ని అమలు చేస్తున్నదని డీజీపీ జితేందర్ తెలిపారు. కొడంగల్లో రూ.10 కోట్లతో పోలీస్స్టేషన్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటివరకు కెమికల్డ్రగ్స్తయారు చేస్తున్న 10 కంపెనీలను సీజ్ చేసినట్లు తెలిపారు.
కొడంగల్లో పీఎస్నిర్మాణానికి రూ. 2.96 కోట్లు, సర్కిల్ పీఎస్కు రూ. 84.50 లక్షలు, దుద్యాలకు రూ. 3 కోట్లు, బోంరాస్పేటకురూ. 2.96 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కాంగ్రెస్కొడంగల్ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, స్టేట్పోలీస్హౌజింగ్కార్పొరేషన్చైర్మన్గుర్నాథ్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాప్సీర్ ఇక్బాల్, పోలీస్హౌసింగ్ ఐజీ రమేశ్ రెడ్డి, కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్రెడ్డి ఉన్నారు.