టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం సాధించిందన్న ఆనందాన్ని ఐసీసీ ఆవిరి చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుందని భారత అభిమానులు సంబరాలు చేసుకోగా..ఐసీసీ ఒక్కసారిగా వాటిని నీరుగార్చింది. టెస్టుల్లో భారత జట్టు టాప్ 1 స్థానాన్ని దక్కించుకోలేదని స్పష్టం చేసింది. ఐసీసీ అధికారిక వెబ్ సైట్లో సాంకేతిక సమస్యతోనే భారత్ నెంబర్ స్థానంలో కనిపించిందని వెల్లడించింది.
మారిన లెక్కలు..
ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ ఆధారంగా టెస్టుల్లో టీమిండియా 115 పాయింట్స్తో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 111 పాయింట్స్తో రెండో స్థానంలో నిలిచినట్లు ఐసీసీ వెబ్ సైట్ లో కనిపించింది. దీంతో అన్ని ఫార్మాట్లలో భారత్ నెంబర్ జట్టుగా అవరించిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు మిగల్లేదు. కొద్దిసేపటి తర్వాత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియానే నెంబర్ వన్ గా దర్శనమిచ్చింది. 126 పాయింట్స్తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ..115 పాయింట్స్తో , భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు కనిపించింది. అయితే ఈ కన్ఫ్యూజన్ టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందని ఐసీసీ పేర్కొంది.