దుకాణ్​​ సీఈఓ దుమారం

దుకాణ్​​ సీఈఓ దుమారం
  • కస్టమర్​ సపోర్ట్​ ఉద్యోగులలో 90 శాతంపై వేటు
  • వారి ప్లేస్​లో ఏఐ చాట్​బాట్​

న్యూఢిల్లీ: కస్టమర్​ సపోర్ట్​ టీమ్​ఉద్యోగులలో 90 శాతం మందిని తొలగించినట్లు ఈ–కామర్స్​ స్టార్టప్​ దుకాణ్​​ సీఈఓ సుమిత్​ షా మంగళవారం వెల్లడించారు. ఆ ఉద్యోగులు చేసే పని కోసం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ఆధారంగా పనిచేసే చాట్​బాట్​ను తీసుకువచ్చినట్లు చెప్పారు. లాభాలను దృష్టిలో పెట్టుకునే ఈ పని చేసినట్లు ఆయన సమర్ధించుకున్నారు. దీంతో కస్టమర్​ సపోర్ట్​ ఖర్చులు 85 శాతం తగ్గాయని, రిజొల్యూషన్​ టైము కూడా అంతకు ముందున్న రెండు గంటల నుంచి ఇప్పుడు 3 నిమిషాలకు తగ్గిపోయిందని షా పేర్కొన్నారు. 

తాజాగా తెచ్చిన ఏఐ చాట్​బాట్​ వల్లే 90 శాతం మంది ఉద్యోగులను తీసేయాల్సి వచ్చిందని షా ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. చాలా మంది ట్విటర్​ యూజర్లు షా నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా యూనికార్న్​ కావడం మీద కంటే లాభదాయకత పెంచుకోవడంపైనే స్టార్టప్​లు ఫోకస్​ పెట్టాల్సి వస్తోందని చెబుతూ, ఉద్యోగుల కోత ఆ దిశలో తీసుకున్న నిర్ణయంగానే సుమిత్​ షా వివరించారు.