- కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులలో 90 శాతంపై వేటు
- వారి ప్లేస్లో ఏఐ చాట్బాట్
న్యూఢిల్లీ: కస్టమర్ సపోర్ట్ టీమ్ఉద్యోగులలో 90 శాతం మందిని తొలగించినట్లు ఈ–కామర్స్ స్టార్టప్ దుకాణ్ సీఈఓ సుమిత్ షా మంగళవారం వెల్లడించారు. ఆ ఉద్యోగులు చేసే పని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్బాట్ను తీసుకువచ్చినట్లు చెప్పారు. లాభాలను దృష్టిలో పెట్టుకునే ఈ పని చేసినట్లు ఆయన సమర్ధించుకున్నారు. దీంతో కస్టమర్ సపోర్ట్ ఖర్చులు 85 శాతం తగ్గాయని, రిజొల్యూషన్ టైము కూడా అంతకు ముందున్న రెండు గంటల నుంచి ఇప్పుడు 3 నిమిషాలకు తగ్గిపోయిందని షా పేర్కొన్నారు.
తాజాగా తెచ్చిన ఏఐ చాట్బాట్ వల్లే 90 శాతం మంది ఉద్యోగులను తీసేయాల్సి వచ్చిందని షా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. చాలా మంది ట్విటర్ యూజర్లు షా నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా యూనికార్న్ కావడం మీద కంటే లాభదాయకత పెంచుకోవడంపైనే స్టార్టప్లు ఫోకస్ పెట్టాల్సి వస్తోందని చెబుతూ, ఉద్యోగుల కోత ఆ దిశలో తీసుకున్న నిర్ణయంగానే సుమిత్ షా వివరించారు.