భైంసాలో ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనం

భైంసాలో ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనం

భైంసా/కోల్​బెల్ట్, వెలుగు: భైంసాలో దుర్గామాత నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవారు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. ముందుగా భవానీ చౌక్​లో దుర్గమాతకు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్యే విఠల్​రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

ఆ తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. డీజే, బ్యాండు మేళాల మధ్య యువకులు నృత్యాలు చేయగా, మహిళలు కొలాటాలు ఆడుతూ సందడి చేశారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గత సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఎస్పీ ప్రవీణ్​కుమార్ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. మందమర్రి, రామకృష్ణాపూర్  మున్సిపాలిటీల పరిధిలోని కాలనీల్లో వెలసిన దుర్గామాత విగ్రహాలను శోభాయాత్రగా తరలించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.