విశాఖ తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్

విశాఖ తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్

ఏపీలోని విశాఖ సాగర తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. రేపు విశాఖలోని బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం నేవీ సిబ్బంది విన్యాసాలు రిహార్సల్స్ చేస్తున్నారు. నేవీ సిబ్బంది చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. యుద్ధ నౌకలు, నేవీ హెలీకాఫ్టర్లతో విన్యాసాలు చేస్తున్నారు. 

నేవీ విన్యాసాలు చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలి వస్తున్నారు. రేపు జరగనున్న వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు.