దేశంలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. త్వరలోనే ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండుల్కర్కు ఎలక్షన్ కమిషన్(ఈసీ) కీలక బాధ్యతలు అప్పగించనుంది. ఎన్నికల పక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా.. అవగాహన కల్పించేందుకుగానూ 'నేషనల్ ఐకాన్'గా నియమించనుంది.
బుధవారం(ఆగష్టు 23న) ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయెల్ సమక్షంలో ఈసీ.. సచిన్తో ఈ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పదంలో భాగంగా సచిన్.. మూడేళ్ల పాటు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు.
Sachin Tendulkar to be declared as the "National Icon" by the Election Commission of India. [RevSportz] pic.twitter.com/IPb1t37EnP
— Johns. (@CricCrazyJohns) August 22, 2023
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకుగానూ ఎన్నికల కమిషన్.. ప్రముఖ వ్యక్తులను 'నేషనల్ ఐకాన్'గా నియమిస్తున్న విషయం తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎమ్ఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్ లను, 2022లో పంకజ్ త్రిపాఠీని ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గా నియమించింది. ప్రజలు ఓటింగ్ పక్రియలో పాల్గొనేలా వీరి ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది.