జూన్ 4న కాదు జూన్ 2 .. ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ

జూన్ 4న కాదు జూన్ 2 .. ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ
  •  అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మార్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును  జూన్ 4 నుంచి జూన్ 2కు మారుస్తున్నట్టు ఆదివారం ఈసీ ప్రకటించింది. లోక్ సభతో పాటే ఈ రెండు రాష్ట్రాల్లోను ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడుతామని ఈసీ శనివారం తెలిపింది.  అయితే, వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది.

అందువల్ల ఈ రాష్ట్రాల్లో జూన్ 4కు బదులు జూన్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక్కడి పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపులో మాత్రం ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.