హుజురాబాద్‌లో కొనసాగుతున్న అధికారుల బదిలీలు

హుజురాబాద్‌లో కొనసాగుతున్న అధికారుల బదిలీలు

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా.. జమ్మికుంట సీఐ రామచంద్రరావును.. వేకెన్సీ రిజర్వ్ కు బదిలీ చేసింది ఈసీ. కరీంనగర్ ట్రాఫిక్ 1 సీఐ గుర్రం తిరుమలకు పోస్టింగ్ ఇచ్చారు. ఇటీవలే.. బీజేపీ నాయకులు జమ్మికుంట సీఐ సహా పలువురు అధికారులపై ఈసీకి కంప్లైంట్ చేశారు. అధికార టీఆర్ఎస్ కొమ్ముకాస్తున్నారని ఫిర్యాదులందడంతో.. ఈసీ చర్యలు తీసుకుంది.