చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా, గ్రామాల్లోని రోడ్లపై దర్జాగా తిరుగుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు ఎప్పుడు దాడులు చేస్తాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు చెప్తున్నారు. ఏనుగుల గుంపుపై ఫిర్యాదు చేసినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు.