బీజేపీ అధికారంలోకి రాగానే జాతరలకు ప్రత్యేక గుర్తింపు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి...

బీజేపీ అధికారంలోకి రాగానే జాతరలకు ప్రత్యేక గుర్తింపు :   ఏలేటి మహేశ్వర్ రెడ్డి...

నిర్మల్, వెలుగు: బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో జరిగే జాతరలు, ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపునివ్వనున్నట్లు ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం  సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో జరిగిన గంగనీళ్ల జాతరలో  ఆయన పెద్దపల్లి జిల్లా బీజేపీ ఇంచార్జ్ రావుల రామనాథ్ తో కలిసి పాల్గొన్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ..  కేవలం బీఆర్ఎస్ ప్రచారం కోసమే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. 

పండగలు, జాతరలను సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని మండిపడ్డారు.  ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మేక ప్రేమ్ కుమార్, హరీశ్ రెడ్డి తదితరులు
 పాల్గొన్నారు.