జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రాబ్ గామ్ ప్రాంతంలో ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు సెర్చ్ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపైకి కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పులను ధీటుగా ఎదుర్కొన్న బలగాలు..ముగ్గుర్ని మట్టుబెట్టారు. చనిపోయిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయి. మే 13న జవాన్ రియాజ్ ను చంపిన ఉగ్రవాది జునైద్ కాల్పుల్లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
#PulwamaEncounterUpdate: All three killed #terrorists are locals, linked with #terror outfit LeT. One of them has been identified as Junaid Sheergojri, involved in #killing of our colleague #Martyr Reyaz Ahmad on 13/5/22: IGP Kashmir@JmuKmrPolice https://t.co/EmLyKLNmge
— Kashmir Zone Police (@KashmirPolice) June 12, 2022