
గోదావరిఖని, వెలుగు: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇతర మావోయిస్టుల హత్యలపై సిట్టింగ్జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్, ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ డిమాండ్ చేశారు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే రహస్య ఒప్పందంలో భాగంగా మోదీ సర్కార్ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. అంతకుముందు గాంధీనగర్లోని ఇఫ్టూ ఆఫీస్ నుంచి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు.