కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పార్లమెంట్కు ఎలక్ట్రిక్ కారులో వచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఢిల్లీలో పెరిగిపోతున్న పొల్యూషన్ను దృష్టిలో ఉంచుకునే తాను ఎలక్ట్రిక్ కారును ప్రిఫర్ చేశానన్నారు. అతిత్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వెహికిల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
‘‘పొల్యూషన్ తగ్గించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలు కూడా సహకరించాలి. వీలైనంత ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ప్రయారిటీ ఇవ్వాలి. కుదరకపోతే ఎలక్ట్రిక్ వెహికిల్స్ను వాడాలి’’అని జవదేకర్ చెప్పారు. ఢిల్లీ పొల్యూషన్పై లోక్సభలో పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.