- కాంగ్రెస్లో చేరిన దోమ మండల ఎంపీపీ, ముఖ్య నేతలు
పరిగి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దోమ మండల బీఆర్ఎస్ ఎంపీపీ అనసూయతో పాటు, ఎంపీటీసీ అనిత, అధికార పార్టీకి చెందిన పలు గ్రామాలు సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, సుమారు వెయ్యిమందికిపైగా కార్యకర్తలు శనివారం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, దోమ మండల బీఆర్ఎస్ జడ్పీటీసీ నాగిరెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల స్కీమ్ ను అమలుచేస్తామన్నారు.