కరోనాతో ఎస్వతిని ప్రధాని మృతి

కరోనాతో ఎస్వతిని ప్రధాని మృతి

ఆఫ్రికాలోని ఎస్వాతీని దేశ ప్రధాని ఆంబ్రోస్ మాండ్వులో లామిని (52) కరోనాతో చనిపోయారు. రెండు వారాల క్రితం లామినికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం  చనిపోయినట్లు ఆదేశ ఉప ప్రధాని థెంబా మాసుకు తెలిపారు. బిజినెస్ మ్యాన్ అయిన లామిని 2018 అక్టోబర్ లో ప్రధానిగా నియమితులయ్యారు. గతంలో స్వాజిలాండ్ అని పిలిచే ఈశ్వతిని దేశ జనాభా 12 లక్షలు. అక్కడ ఇప్పటి వరకు 6700 కరోనా కేసులు నమోదవ్వగా 127 మంది చనిపోయారు.

రూ.12 వేల అప్పు తీర్చలేదని తల్లిని చంపేసింది