హైదరాబాద్, వెలుగు : భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫోటాన్ ఆర్బ్ సీవ్ (పీఓఎస్) టెక్నాలజీ గల మాగ్నస్ ఫ్యాన్లను మార్కెట్కు పరిచయం చేసినట్టు ఇవాస్ ఎలక్ట్రికల్స్ ప్రకటించింది. ఎక్కువ ఎయిర్ -డెలివరీ సామర్థ్యం దీని సొంతం. ఇందులో 32 వాట్ల బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్
(బీఎల్డీసీ) మోటార్ తగినంత గాలిని అందిస్తుంది. కరెంటును తక్కువగా వాడుకుంటుంది. డిజైన్కూడా అద్భుతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిని హైదరాబాద్లోని తమ యూనిట్లోనే తయారు చేస్తున్నామని ఇవాస్ వెల్లడించింది.