యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి

రాష్ట్రంలో అకాల వర్షాలతో జనజీవనం అస్థవ్యస్థమైందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని  కోరారు. ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులను గుర్తించి, వారికి వెంటనే సహాయక చర్యలు అందేలాచూడాలని కోరారు.  ఈ విషయాలలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని  అన్నారు. అటు వర్షాల కారణంగా రైతులు  తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇక వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని భట్టి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయ చర్యలు చేయాలని విజ్ఞప్తి చేశారు.