
లింగంపేట, వెలుగు: మండలంలోని కన్నాపూర్ తండా అంగన్వాడీ కేంద్రంలో ఎక్స్పైరీ దాటిన పాలు.. పురుగు పట్టిన కందిపప్పు పంపిణీ చేశారు. తండాకు చెందిన గర్భిణి దేవసోత్ మౌనిక సోమవారం అంగన్వాడీ సెంటర్కు వెళ్లగా అంగన్వాడీ నిర్వాహకురాలు రోజా గడువు దాటిన పాల ప్యాకెట్, పురుగు పట్టిన కందిపప్పు ప్యాకెట్ ఇచ్చారని వాపోయారు. పాలప్యాకెట్ఎక్స్పైరీ డేట్2023 మార్చి 2 ఉండగా, పప్పుకు ప్యాకెట్లోనే పురుగు పట్టడంతో అవాక్కయ్యామన్నారు. ఇదేమిటని రోజాను ప్రశ్నించగా.. ఏప్రిల్26న స్టాక్ వచ్చిందని, తాను చూసుకోకుండా ఇచ్చానని చెప్పారు. సూపర్వైజర్ స్వరూపరాణి ని ప్రశ్నించగా.. వెంటనే అక్కడికి వచ్చి అంగన్వాడీ కార్యకర్త రోజాకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు.