జీఎస్టీ రిటర్నుల దాఖలు‌ గడువు పొడిగింపు

జీఎస్టీ రిటర్నుల దాఖలు‌ గడువు పొడిగింపు
  • ఆఖరు తేది మార్చి 31

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికిగానూ ఆన్యువల్‌ రిటర్నుల (జీఎస్టీఆర్–-9), రీకన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్ల (జీఎస్టీఆర్–-9 సీ) ఫైలింగ్‌ గడవును పొడగించారు. వీటిని ఈ నెల 28 నుండి వచ్చే నెల 31 వరకు అందజేయవచ్చు. ట్యాక్స్‌ పేయర్ల రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ పర్మిషన్‌ కూడా తీసుకున్నామని వివరించింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుందని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఏటా జీఎస్టీ కింద ట్యాక్స్‌పేయర్లు జీఎస్టీఆర్–-9 రిటర్నును అందజేయాలి. జీఎస్టీఆర్‌-–9ఆర్‌, ఆడిటెడ్‌ యాన్యువల్‌ స్టేట్‌మెంట్లు సరిగ్గా ఉన్నట్టు జీఎస్టీఆర్‌–9సి నిర్ధారిస్తుంది.

ఇవి కూడా చదవండి

అగ్గువ వడ్డీకే హోమ్‌ లోన్స్‌

ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం

మహిళా దినోత్సవం కోరిక ఆమెదే

టెట్​ లేకుండానే టీచర్స్ రిక్రూట్​మెంట్​కు సర్కార్ ఆలోచన