రైతుల కోసం రైతు బిడ్డ చేసిన యాప్​

రైతుల కోసం రైతు బిడ్డ చేసిన యాప్​

ఉత్తరప్రదేశ్​లోని లలిత్​పూజ్​ జిల్లా పాథా ఊరికి చెందిన అమ్మాయి నందిని. పద్నాలుగేండ్లు ఉంటాయి. గవర్నమెంట్​ గర్ల్స్​ స్కూల్​లో  తొమ్మిదో క్లాస్​ చదువుతోంది.  తండ్రి  రైతు.  టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం నందినికి. లాక్ డౌన్​ టైంలో వీళ్ల స్కూల్​ నుంచి ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ అనే ప్రాజెక్ట్​ద్వారా టీచర్లతో కలిసి పిల్లలంతా ఏఐ వెబ్​సైట్​ను తయారుచేశారు. దాన్నుంచి ఇన్​స్పైర్​ అయింది. మరోవైపు  లాక్​డౌన్​లో కూడా ఆన్​లైన్​ క్లాస్​లు  మిస్​ కాలేదు. ఆమె డెడికేషన్​ చూసిన ఇంటెల్​ ల్యాప్​టాప్​ కంపెనీ నందినికి కొత్త ల్యాప్​ టాప్​ గిఫ్ట్​గా ఇచ్చింది. ఇది నందినికి మరింత కాన్ఫిడెన్స్​ ఇచ్చింది. అదే నమ్మకంతో  కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. ఆ టైంలో  రైతులు సాయిల్​ టెస్టింగ్ కోసం మాట్లాడుకోవడం విన్నది.  ఎప్పుడూ వాళ్లు అగ్రికల్చర్​ ఆఫీస్​కు వెళ్లి సాయిల్​ టెస్టింగ్​ కోసం వాళ్లు పడే ఇబ్బంది, నేల నాణ్యత తెలుసుకోకుండా పంటలు వేసి కొందరు రైతులు నష్టపోవడం గమనించింది.  రైతుల కోసం స్కూల్​లో డిజైన్​ చేసిన వెబ్​సైట్​ మాదిరిగా ఫోన్​ యాప్​ తయారు చేయాలను కుంది. అందుకు మాథ్స్​​ టీచర్​ సాయం తీసుకుంది. తన ప్రాజెక్ట్​కు ‘మిట్టి కో జానో, ఫసల్ పెహచానో' అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్ట్​ ద్వారా  ఏఐ యాప్​ను తయారు చేసింది. మట్టిలోని టెంపరేచర్​, నైట్రోజన్​ విలువలను తెలుసుకొని, దానికి తగ్గ పంటను ఈ యాప్​ సూచిస్తుంది. స్మార్ట్ డేటా ఆధారంగా ఇది పని చేస్తుంది. రైతులు కూడా ఈ యాప్​ను ఈజీగా వాడొచ్చు. ఈ కంప్లీట్​ ప్రాజెక్ట్​ను ఢిల్లీలో జరిగిన నేషనల్​ ఎగ్జిబిషన్​లో ప్రదర్శించింది. దానికి చీఫ్ డెవలప్‌‌మెంట్ ఆఫీసర్ అనిల్ కుమార్ పాండే ఫిదా అయ్యారు. ‘జిల్లాతో పాటు రాష్ట్రంలోని విద్యార్థులందరినీ ఇది చాలా ఇన్​స్పైర్​ చేస్తుంది. రైతులకు ఎంతో ఉపయోగం’ అని  అన్నారాయన. ఈ ఎగ్జిబిషన్​లో యూపీ నుంచి పాల్గొన్న ఏకైక అమ్మాయి నందిని కావడం విశేషం.