ఉత్తరప్రదేశ్లోని లలిత్పూజ్ జిల్లా పాథా ఊరికి చెందిన అమ్మాయి నందిని. పద్నాలుగేండ్లు ఉంటాయి. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో తొమ్మిదో క్లాస్ చదువుతోంది. తండ్రి రైతు. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం నందినికి. లాక్ డౌన్ టైంలో వీళ్ల స్కూల్ నుంచి ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ అనే ప్రాజెక్ట్ద్వారా టీచర్లతో కలిసి పిల్లలంతా ఏఐ వెబ్సైట్ను తయారుచేశారు. దాన్నుంచి ఇన్స్పైర్ అయింది. మరోవైపు లాక్డౌన్లో కూడా ఆన్లైన్ క్లాస్లు మిస్ కాలేదు. ఆమె డెడికేషన్ చూసిన ఇంటెల్ ల్యాప్టాప్ కంపెనీ నందినికి కొత్త ల్యాప్ టాప్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇది నందినికి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదే నమ్మకంతో కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. ఆ టైంలో రైతులు సాయిల్ టెస్టింగ్ కోసం మాట్లాడుకోవడం విన్నది. ఎప్పుడూ వాళ్లు అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్లి సాయిల్ టెస్టింగ్ కోసం వాళ్లు పడే ఇబ్బంది, నేల నాణ్యత తెలుసుకోకుండా పంటలు వేసి కొందరు రైతులు నష్టపోవడం గమనించింది. రైతుల కోసం స్కూల్లో డిజైన్ చేసిన వెబ్సైట్ మాదిరిగా ఫోన్ యాప్ తయారు చేయాలను కుంది. అందుకు మాథ్స్ టీచర్ సాయం తీసుకుంది. తన ప్రాజెక్ట్కు ‘మిట్టి కో జానో, ఫసల్ పెహచానో' అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏఐ యాప్ను తయారు చేసింది. మట్టిలోని టెంపరేచర్, నైట్రోజన్ విలువలను తెలుసుకొని, దానికి తగ్గ పంటను ఈ యాప్ సూచిస్తుంది. స్మార్ట్ డేటా ఆధారంగా ఇది పని చేస్తుంది. రైతులు కూడా ఈ యాప్ను ఈజీగా వాడొచ్చు. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ను ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది. దానికి చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ కుమార్ పాండే ఫిదా అయ్యారు. ‘జిల్లాతో పాటు రాష్ట్రంలోని విద్యార్థులందరినీ ఇది చాలా ఇన్స్పైర్ చేస్తుంది. రైతులకు ఎంతో ఉపయోగం’ అని అన్నారాయన. ఈ ఎగ్జిబిషన్లో యూపీ నుంచి పాల్గొన్న ఏకైక అమ్మాయి నందిని కావడం విశేషం.
రైతుల కోసం రైతు బిడ్డ చేసిన యాప్
- లైఫ్
- December 2, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి