పంట కోతకు కూలీలు దొరక్క రైతు సూసైడ్

పంట కోతకు కూలీలు దొరక్క రైతు సూసైడ్
  • యూపీలో ఘటన 

లక్నో: లాక్​డౌన్ కారణంగా తన గోధుమ పంట కోయడానికి కూలీలెవరూ రాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన యూపీలోని బండా జిల్లాలో శనివారం జరిగింది. ‘‘రంభవన్ శుక్లా(52) అనే రైతు జారీ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. తన పంట కోతకు కూలీలకోసం కొద్ది రోజులుగా వెతుకుతున్నాడు. శనివారం కూడా డే అంతా తిరిగితే ఎవరూ రావడానికి మొగ్గు చూపలేదు. దీంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు”అని అడిషనల్ సూపరింటెండెంట్ లాల్​భరత్ కుమార్ పాల్ మీడియాకు వెల్లడించారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందజేశామని చెప్పారు.