
సంస్థాన్ నారాయణపురం, వెలుగు: ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వెళ్లే రహదారిని రైతులు దిగ్బంధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల స్టేజీ వద్ద చౌటుప్పల్ -మునుగోడు రహదారిపై మంగళవారం భూ నిర్వాసితులు బైఠాయించారు.
ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ పొట్టలు కొట్టేలా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఉన్నదని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల్లో నుంచి వెళ్తున్న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తక్షణమే మార్చేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుమారు గంటకు పైగా రహదారిపై బైఠాయించిన భూనిర్వాసితులను స్థానిక ఎస్సై జే.జగన్ పోలీసు సిబ్బంది రైతులను పక్కకు తీసుకెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేశారు.