
దుబ్బాక, వెలుగు: దుబ్బాక మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ ఫర్టిలైజర్ షాపు వద్ద శుక్రవారం ఉదయం నుంచే పెద్దగుండవెళ్లి, అప్పనపల్లి, హసన్ మీరాపూర్, పద్మనాభునిపల్లి, మర్రి కుంట, మిరుదొడ్డి మండలం కొండాపూర్, ధర్మారం, సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామాల రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు.
గంటల తరబడి నిలబడితే కేవలం రెండు బస్తాలే దొరుకుతున్నాయని, మిగతా వాటి కోసం ఎక్కడికెళ్లాలని వాపోతున్నారు. సాగుకు సరిపడా యూరియా బస్తాలను అందజేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.