సెల్​బే నుంచి  పండగ ఆఫర్లు

సెల్​బే నుంచి  పండగ ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో వేగంగా ఎదుగుతున్న మొబైల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ రిటెయిల్​ చెయిన్​ సెల్​బే దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. మెరుగైన ప్రొడక్ట్ రేంజ్​తోపాటు, ఆఫర్ల విషయంలోనూ తాము ముందుంటామని సెల్​బే వెల్లడించింది. ప్రతి కస్టమర్​కూ కచ్చితమైన బహుమతి వచ్చేలా ఆఫర్లు తెస్తున్నట్లు పేర్కొంది. స్మార్ట్​ ఫోన్​ కొనుగోలుపై రూ. 7 వేల దాకా క్యాష్​ బ్యాక్​, స్మార్ట్​ టీవీ కొనుగోలుపై రూ. 5 వేల దాకా క్యాష్​ బ్యాక్​ ఆఫర్లు ఇస్తోంది సెల్​బే.  ఏడాది కాలానికి అదనపు వారంటీ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. శామ్‌సంగ్​ మొబైల్స్​పై రూ. 13 వేల దాకా తగ్గింపు, ఎంఐ మొబైల్స్​పై రెడ్​మి టీ డబ్ల్యూఎస్​ 2సీ ఉచితంగా ఆఫర్​ చేస్తున్నారు. అన్ని బ్రాండ్ల పైనా  ఆఫర్లున్నాయని, ఒక్క రూపాయి చెల్లించి ఫైనాన్స్​తో కొనుగోలు సదుపాయాన్నీ అందిస్తున్నామని సెల్​బే పేర్కొంది. ఎక్స్చేంజి కోసం మెగా ఎక్స్చేంజ్​ బోనస్ ఆఫర్​నూ​ అందుబాటులో ఉంచుతున్నారు.​ ప్రతీ కొనుగోలుపై 6 నెలల పాటు ఫ్రీ స్క్రీన్​ రిప్లేస్​మెంట్​, బ్లూటూత్​ స్పీకర్​ లేదా పవర్​ బ్యాంక్​ లేదా బ్రాండెడ్​ డిన్నర్​ బౌల్​ ఉచితంగా ఇవ్వనున్నారు. ఉచిత ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది.  దసరా, దీపావళి పండగల కోసం తెచ్చిన ఆఫర్లను ఉపయోగించుకోవల్సిందిగా సెల్​బే ఎండీ సోమ నాగరాజు కస్టమర్లను ఈ సందర్భంగా  కోరారు.