వాషింగ్టన్: గ్లోబలైజేషన్ బెనిఫిట్స్ను రివర్స్ చేయాలని తాము కోరుకోవడం లేదని, కానీ ప్రాసెస్ మరింత పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్సమావేశంలో భాగం పంచుకోవడానికి ఫైనాన్స్ మినిస్టర్ వాషింగ్టన్ చేరుకున్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ఎదిగేలా చేయడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని, ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయని చెబుతూ, ఫైనల్ కన్జూమర్ గూడ్స్ను తాము దిగుమతి చేసుకోమని, అవి తయారు చేసుకునే కెపాసిటీ తమకు ఉందని నిర్మల పేర్కొన్నారు. ధరలలో వ్యత్యాసం పర్చేజింగ్ డెసిషన్స్పై ప్రభావం చూపెడుతుందని, తక్కువ రేటుకే దొరికేటప్పుడు తయారు చేయడం ఎందుకనే ఆలోచనతో, దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సమస్యను ఇండియన్స్ చాలా కాలంగా ఎదుర్కొంటున్నారని, రోజూ వాడే కొన్ని ప్రొడక్టులను తయారు చేసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. కానీ, దేశంలోనే ఎక్కువ మంది కన్జూమర్లు ఉండటంతో ఇప్పుడు ఇక్కడే తయారు కావాలనే ఆలోచనతో
పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
డబ్ల్యూటీఓ ఇతర దేశాల మాట కూడా వినాలి
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) ఇతర దేశాల మాట కూడా వినాలని, మరింత ప్రోగ్రెసివ్గా ఉండాలని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. అందరు మెంబర్లకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. మార్కెట్ లిబరలైజేషన్ ఏమేరకు ఉండాలనే విషయంలో ఇప్పుడు చాలా దేశాలు ఆలోచిస్తున్నాయని అమెరికా కామర్స్ సెక్రటరీ కేథరిన్ తాయ్ ఇటీవల ఒక సందర్భంలో చెప్పారని, 2014–15 లో తాను కామర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంచుమించుగా ఇదే విషయాన్ని ప్రస్తావించినా గ్లోబల్ మీడియా దృష్టిని ఆకట్టుకోలేకపోయానని ఆమె అన్నారు. ఇప్పుడు కూడా చాలా దేశాలు తనలాగే ఆలోచిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆఫ్రికా లేదా పసిఫిక్ ఐలాండ్స్ లేదా మరేదైనా దేశం...అన్ని దేశాలు ఎదగాలని కోరుకుంటున్నాయని, ఇండియాకు ఆయా దేశాలు చేసే ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలూ లేవని చెప్పారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్(ఎంఎఫ్ఎన్) రూట్లో తమ దేశంలో తయారు చేయగల ప్రొడక్టులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని, ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు.