అనాథ పిల్లలకు ఆర్థిక సాయం

అనాథ పిల్లలకు ఆర్థిక సాయం

కోల్​బెల్ట్​,వెలుగు: మందమర్రి మార్కెట్​ రెండోజోన్​కు చెందిన చిన్నారులు ఒజ్జ హార్దిక్​, కార్తీక్ కు శుక్రవారం​ ‘మా పద్మావతి వెల్ఫేర్​ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.12వేల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల వారి తల్లి అనారోగ్యంతో చనిపోగా అంతకుముందు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. వీరికి ఫౌండేషన్స్ నిర్వాహకుడు అడ్వకేట్​ రంజిత్​గౌడ్​ ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించిన ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు గుడ్ల రమేశ్​, బుర్ర ఆంజనేయులు, సట్ల సంతోశ్​, మహంతి అర్జున్​, తిరుమల్​రెడ్డి, సతీశ్​, కిరణ్​, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.