మిర్యాలగూడలో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రికల్ గోడౌన్లో మంటలు

మిర్యాలగూడలో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రికల్ గోడౌన్లో మంటలు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం(అక్టోబర్12)  మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్​ పేటలోశ్రీలక్ష్మీ పవన్ ఎలక్ట్రికల్​ , విజయలక్ష్మీ ఆటోమోటివ్​ గోడైన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు భయంతో పరుగులు పెట్టారు.

ఈ ప్రమాదంలో ఎలక్ట్రకల్, ఆటోమోటివ్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది మంటలార్పారు.  30లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.