
బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్లో ఉన్న రైల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అన్ని బోగీలకు మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నికీలలు ఎగిసి పడి స్దేషన్ అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, కూలీలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Fire breaks out in an empty train at Madhubani railway station in Bihar pic.twitter.com/Rps2N8gwKk
— ANI (@ANI) February 19, 2022