బీహార్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మే 1 వ తేది రాత్రి 12 గంటలకు ముజఫర్ పుర్ జిల్లాలోని రామ్ దయాల్ ప్రాంతంలో ని ఓ మురికివాడలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఇంట్లో వస్తువులన్నీ కాలి బూడిదయిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు , ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను ఎస్ కే ఎమ్ హెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.