అర్థరాత్రి అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు సజీవదహనం

అర్థరాత్రి అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు సజీవదహనం

బీహార్ లో  ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.   మే 1 వ తేది  రాత్రి 12 గంటలకు ముజఫర్ పుర్ జిల్లాలోని రామ్ దయాల్ ప్రాంతంలో ని ఓ  మురికివాడలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు  మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.  ఇంట్లో వస్తువులన్నీ కాలి బూడిదయిపోయాయి.

 సమాచారం అందుకున్న పోలీసులు , ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను ఎస్ కే ఎమ్ హెచ్ ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని  పోలీసులు చెబుతున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.