శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రతి జబ్బుకు ఇదిగో ట్రీట్మెంట్.. అదిగో మెడిసిన్ అంటున్నారు వైద్యులు. ఇప్పటికే క్యాన్సర్ తదితర మహమ్మారులకు నివారణోపాయం కనుక్కున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో ఆపరేషన్చేసి సక్సెస్ అయ్యారు. అదే డిప్రెషన్ సర్జరీ. భారత్లో ఫస్ట్టైం కుంగుబాటుకు(డిప్రెషన్) సర్జరీ చేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 26 ఏళ్లుగా డిప్రెషన్ తో బాధ పడుతూ ఉండేవారు. దీంతో ముంబయిలోని జన్లోక్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో ఆమెకు డీప్ బ్రెయిన్ స్టిములేషన్ సర్జరీ చేశారు. ఇది సక్సెస్ కావడంతో డాక్టర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2017లో మానసిక ఆరోగ్య చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో జరిగిన ఫస్ట్ డిప్రెషన్ సర్జరీ ఇదే కావడం విశేషం. నాడీ వ్యవస్థలో లోపాల వల్ల వచ్చే వ్యాధులు నయం చేయడానికి ఈ సర్జరీ చేస్తారు.