గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేసి చుక్కల దుప్పిని హతమార్చారు. వన్యప్రాణుల మాంసం అమ్ముతున్నారనే సమాచారంతో ఎఫ్ఆర్వో ప్రసాదరావు సిబ్బందితో కలిసి గుంజేడు సమీపంలోని బుగ్గచెలిమె ప్రాంతానికి చేరుకోగా, వేటగాళ్లు బైక్లు, దుప్పి మాంసం వదిలేసి పరారయ్యారు. వాటిని స్వాధీనం చేసుకొని గూడూరు రేంజ్ ఆఫీస్ కు తరలించారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఆధారంగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలం నాజి తండాకు చెందిన జాటోత్ రమేశ్, భూక్య మోహన్, భూక్య నాగేంద్రగా గుర్తించినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. నిందితులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు.
