ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కు కీలక పదవి

ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కు కీలక పదవి

అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ పదవీ కాలం ఆరు నెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పోస్టులో గౌతమ్ సవాంగ్ ను నియమించింది ప్రభుత్వం. రెండు రోజుల క్రితం డీజీపీ పదవి నుంచి ఏపీ సర్కార్ ఆయనను బదిలీ చేయడంపై ఏపీలో తీవ్ర విమర్శలు వచ్చాయి.