పేదల భూములను లాక్కుంటున్నారు

పేదల భూములను లాక్కుంటున్నారు

మహబూబ్ నగర్: పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా గుంజుకుంటోందని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలని డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూమాఫియా పెరిగిపోయిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు భూ దందాలకు పాల్పడుతూ... వేల కోట్ల భూములు కొల్లగొడుతున్నారన్నారు. ఎదిరించిన వాళ్లను హతమారుస్తామంటూ బెదిరిస్తున్నారన్న ఆయన... టీఆర్ఎస్ నాయకులు నయీం గ్యాంగ్ లా తయారయ్యారన్నారు. వేల కోట్ల విలువైన మియాపూర్ భూముల వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

శ్రీలంక మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం

గౌహతిలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం