ముథోల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వండి : మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్

ముథోల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వండి : మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్
  • మంత్రి వివేక్​ వెంకటస్వామిని కోరిన మాజీ ఎమ్మెల్యే నారాయణ్ ​రావు పటేల్​

భైంసా, వెలుగు: ముథోల్​ నియోజకవర్గ అభివృద్ధికి సీఎస్ఆర్, డీఎంఎఫ్ టీ నిధులు ఇవ్వాలని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్​కోరారు. సోమవారం హైదరాబాద్​లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రోడ్లు,  ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇందుకు మంత్రి వివేక్​సానుకూలంగా స్పందించారని, నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నారాయణ్​ రావు పటేల్​ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ ​నాయకులు ఉన్నారు.