దివ్యాంగుడికి 10 లక్షలతో ఇల్లు కట్టించిన మాజీ ఎమ్మెల్యే

దివ్యాంగుడికి 10 లక్షలతో ఇల్లు కట్టించిన మాజీ ఎమ్మెల్యే

 కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ఔదార్యం చాటుకున్నారు. గుడిసెలో నివసిస్తున్న దివ్యాంగుడికి తన సొంత పైసలు రూ.10 లక్షలతో ఇంటిని కట్టించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటకు చెందిన షేక్​ఖాదర్​ దివ్యాంగుడు. రోడ్డు పక్కన ఉన్న తన స్థలంలో గుడిసెలో ఉండేవారు.

అతడి కష్టాన్ని చూసిన గంప గోవర్ధన్​ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు.  ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. ఆదివారం ఆ ఇంటిని ఆయన ప్రారంభించారు. షేక్​ఖాదర్​ కుటుంబానికి కొత్త బట్టలు పెట్టి, అక్కడే టీ తాగారు. కార్యక్రమంలో బీఆర్ఎస్​ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబోద్దీన్, ఎంపీపీ ఆంజనేయులు, బీఆర్ఎస్​ టౌన్ ​ప్రెసిడెంట్​ప్రభాకర్​రెడ్డి, లీడర్లు గోపిగౌడ్, రవి కుమార్, భాను, రవితేజ పాల్గొన్నారు.