టాటాస్టీల్​ మాజీ ఎండీ ఇరానీ కన్నుమూత

టాటాస్టీల్​ మాజీ ఎండీ ఇరానీ కన్నుమూత

న్యూఢిల్లీ: ‘స్టీల్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా’గా పేరున్న టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్​ జే ఇరానీ (86) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. జంషెడ్​పూర్​లోని టాటా ఆస్పత్రిలో తుదిశ్వాస వదిలారని టాటా స్టీల్​ తెలిపింది. దాదాపు 43 ఏళ్లపాటు సేవలు అందించాక, కంపెనీ నుంచి ఆయన 2011లో వైదొలిగారు. ఉక్కురంగం అభివృద్ధికి అందించిన సేవలకుగాను ఆయనకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇరానీ 1936, జూన్ ​రెండున నాగ్​పూర్​లో జన్మించారు. ఇదే నగరంలో 1958లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1963లో యూకే యూనివర్సిటీ నుంచి మెటలర్జీలో పీహెచ్​డీ చేశారు.