మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ప్రైమ్ క్రిటికేర్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో నలుగురు రోగులు మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్, ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జితేంద్ర ఆహ్వాడ్ తెలిపారు.
