చాటింగ్.. చీటింగ్.. మ్యాట్రిమొనీ పేరుతో పరిచయం.. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో లక్షన్నర మాయం

చాటింగ్.. చీటింగ్.. మ్యాట్రిమొనీ పేరుతో పరిచయం.. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్  పేరుతో లక్షన్నర మాయం

బషీర్​బాగ్, వెలుగు: మ్యాట్రీమొనీ యాప్ ద్వారా పరిచయం అయిన సైబర్​ నేరగాళ్లు ఓ వ్యక్తిని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్​మెంట్​ పేరుతో మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. జియాగూడ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి జీవన్ సాతి మ్యాట్రిమొనీ యాప్​ ద్వారా స్కామర్లు  సంప్రదించారు. మలేషియాకు చెందిన మహిళగా చాటింగ్ చేశారు. చనువు అయ్యాక క్రిప్టో కరెన్సీలో తాను ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తున్నట్లు నమ్మించారు. బాధితుడు నుంచి రూ.లక్షా 56 వేలు పెట్టించి ఓ లింక్​ ద్వారా ఆ డబ్బులను కొట్టేశారు.

పీఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ తో..

నకిలీ పీఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ తో స్కామర్స్ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. బహదూర్ పురాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి వాట్సాప్ కు ఈ నెల 5న పీఎం కిసాన్ యోజన పేరిట ఏపీకే ఫైల్ పంపారు. ఆ ఫైల్ ఇన్​స్టాల్​ అయ్యాక ఫోన్ హ్యాక్​ అయింది. స్కామర్స్ ఫోన్ యాక్సెస్ చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి రూ.2 లక్షల 90 వేలు 
కొట్టేశారు.